NRI-NRT

ఏపీలో ప్రవాసులు పెట్టుబడులు పెట్టాలి. మేరీల్యాండ్‌లో కూటమి విజయోత్సవం.

ఏపీలో ప్రవాసులు పెట్టుబడులు పెట్టాలి. మేరీల్యాండ్‌లో కూటమి విజయోత్సవం.

అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రంలో కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్, రామోజీరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రముఖ ప్రవాస వైద్యులు డా. యడ్ల హేమప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకురావాలని, పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించి ఉద్యోగావకాశాల కల్పనకు తోడ్పడాలని కోరారు.

శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, జూలకంటి బ్రహ్మారెడ్డి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోట్లూరి భాస్కరరావు తదితరులు ప్రసంగించి తెదేపా ప్రభుత్వ కార్యాచరణను వివరించారు. వేడుకలో శ్రీనాథ్ రావుల, శివ నెలకుదిటి, సత్యనారాయణ మన్నె, భాను మాగులూరి, శ్రీనివాస్ దామ, రాజా రావులపల్లి, శివ నెల్లూరి, రాజశేఖర్ చెరుకూరి, హరీష్ కూకట్ల, శ్రీనివాస్ సామినేని, శ్రీను పోతు, సుందర్ క్రోసూరి, మురళి ముల్పురి, హర్ష పేరమనేని తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z