WorldWonders

₹100 కోసం రెండు ఏటీఎంలు ధ్వంసం

₹100 కోసం రెండు ఏటీఎంలు ధ్వంసం

మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు పక్కనే ఏటీఎంను ఏర్పాటు చేశారు. సిద్దిపేట చౌరస్తాలో ఓ ప్రైవేటు ఏటీఎం ఉంది. కాగా పట్టణానికి చెందిన షాదక్‌కు రూ.100 అవసరం ఉండటంతో గురువారం రాత్రి సిద్దిపేట చౌరస్తాలోని ఏటీఎం వద్దకు వెళ్లాడు. నగదు రాకపోవడంతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అక్కడి నుంచి ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు వచ్చాడు. అక్కడా నగదు కోసం ప్రయత్నించి రాకపోవడంతో ఏటీఎంను రాయితో ధ్వంసం చేశాడు. మొదట గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించినట్లు శుక్రవారం ఫిర్యాదు అందగా ఎస్సై రంజిత్‌ విచారణ చేపట్టారు. బ్యాంకు సమీపంలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పట్టణానికి చెందిన సాదక్‌గా గుర్తించి కేసు నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z