Business

మహీంద్రా XUV ధర తగ్గింపు

మహీంద్రా XUV ధర తగ్గింపు

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra Mahindra) ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 700 AX7 వాహన శ్రేణి ధరలను తగ్గించింది. ఎక్స్‌యూవీని మార్కెట్‌లో విడుదల చేసి మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కొత్త ధరలను మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. మార్కెట్లోకి ప్రవేశించిన అనతికాలంలోనే ఈ మోడల్‌.. మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో పాటు 2 లక్షల యూనిట్ల అమ్మకాలను ఇటీవల నమోదు చేసింది.

ఏఎక్స్‌7 వేరియంట్‌ ధరలు రూ.19.49 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతాయి. గతంలో ఈ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.21.54 లక్షలుగా ఉండేది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.2 లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. కొత్త ధరలు జులై 10 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ధరలు కేవలం నాలుగు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా పేర్కొంది. ఇటీవలే ఈ మోడల్‌లో డీప్‌ ఫారెస్ట్‌, బర్న్ట్‌ సియెన్నా పెయింట్‌ ఆప్షన్లను కూడా తీసుకొచ్చింది. ఎక్స్‌యూవీ 700 ఏఎక్స్‌7 శ్రేణిలో అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌తో కూడిన అడాస్ లెవల్‌ 2 వంటి అత్యాధునిక భద్రతా సదుపాయాలు ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z