Movies

హత్యకేసులో విచారణ ఖైదీ. ఇంటిభోజనం కోసం అర్జీ.

హత్యకేసులో విచారణ ఖైదీ. ఇంటిభోజనం కోసం అర్జీ.

తనకు ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ హత్య కేసులో పరప్పన అగ్రహార కారాగారం చేరిన నటుడు దర్శన్‌ ఉన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నాడు. విచారణ ఖైదీగా ఉన్న తనకు కారాగారంలో ఇస్తున్న ఆహారం జీర్ణం కావడం లేదని వాపోయాడు. నిత్యం అత్యంత ఖరీదైన ఆహారం ఆరగించే ఆయనకు కారాగారంలో సాధారణ ఆహారాన్నే అందిస్తున్నారు. ఉప్మా, అన్నం, సాంబారు, రాగిముద్ద, మజ్జిగ వంటివి సరిపోవడం లేదని, తన బరువు గణనీయంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. గడచిన పక్షం రోజుల్లో ఆయన ఏకంగా పది కిలోల బరువు తగ్గిపోయారనే వదంతులు బయట వినిపించాయి. ఇలా వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యరీత్యా ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆయన అర్జీని న్యాయస్థానం త్వరలో విచారణకు స్వీకరించనుంది. దర్శన్‌కు నిత్యం మాంసాహారం తీసుకోవడం అలవాటు. కారాగారంలో వారంలో రెండు రోజుల మాత్రమే మాంసాహారాన్ని ఇవ్వడం, అదీ పరిమితిలో ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అతని భార్య విజయలక్ష్మి పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z