Agriculture

ముందు రైతులు…తర్వాత ఎన్నికలు

ముందు రైతులు…తర్వాత ఎన్నికలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల సూచనలను ఈ ప్రభుత్వం తప్పక పాటిస్తుందన్నారు. రైతు రుణమాఫీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z