నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందోవెన్ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, వెనిగండ్ల రాము, సొంగా రోషన్, తెదేపా నాన్ రెసిడెంట్స్ అధ్యక్షుడు వేమూరి రవికుమార్ తదితరులు జూమ్ ద్వారా హాజరై అందరినీ అభినందించారు. అనంతరం అభిమానులు విజయోత్సవ కేక్ను కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z