NRI-NRT

తానా-పాఠశాల ఛైర్మన్‌గా భాను మాగులూరి

తానా-పాఠశాల ఛైర్మన్‌గా భాను మాగులూరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తానా ఆధ్వర్యంలో అమెరికాలో తెలుగు భాషాభివృద్ధి, పరివ్యాప్తి కోసం ప్రవాసుల చిన్నారుల కోసం నిర్వహిస్తున్న “తానా-పాఠశాల” విద్యార్థుల నమోదు కార్యక్రమం డీసీలో నిర్వహించారు. ఈ విభాగ అధ్యక్షుడిగా భాను మాగులూరి నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ భాష సాంస్కృతిక వారథని అన్నారు. మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు. మన పిల్లలు ఏ భాషలో చదువుకున్నా.. చక్కటి తెలుగును వారికి నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. అన్ని భాషల్లో గొప్ప భాష తెలుగు. అలాంటి తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు పాల్గొని భాను మాగులూరిని సత్కరించారు. యెండూరి సీతారామారావు, అవిర్నేని రమేష్ , ఆలంపల్లి రవి కుమార్, రమా దేవి (డిప్యూటీ డైరెక్టర్ ఖాదీ ఇండస్ట్రీస్), పొత్తూరి నాగసత్యనారాయణ రాజు, బిక్కిన వీర్రాజు, బాలచందర్, దయాకర్, శంకర్ ప్రసాద్ తదిదరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z