NRI-NRT

GWTCS-50: ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసిన అధ్యక్షుడు లాం కృష్ణ

GWTCS-50: ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసిన అధ్యక్షుడు లాం కృష్ణ

వాషింగ్టన్ డీసీ ప్రవాస తెలుగువారికి గత 50 సంవత్సరాలుగా సేవలందిస్తున్న గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు కల్చరల్‌ సంఘం (జిడబ్ల్యుటిసిఎస్‌) స్వర్ణోత్సవాల వేడుకలను సెప్టెంబర్‌ 27,28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, రాజకీయ నాయకులతో ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలకు పలువురు ప్రముఖులను ఆయన ఆహ్వానించారు.

తన భారత పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి లోకేష్‌, హోం మంత్రి అనిత, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, టిడిపి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, సినిమా దర్శకుడు కొరటాల శివ తదితరులను కృష్ణ లాం కలుసుకుని స్వర్ణోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణలో కూడా పలువురు ప్రముఖులను కలిసి ఈ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z