Politics

నన్ను చంపాలనుకుంటే చంపేయండి – జగన్

నన్ను చంపాలనుకుంటే చంపేయండి – జగన్

‘ఏదైనా ఉంటే నాతో తేల్చు­కోవాలి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సాను­భూతి­పరులు, మీకు ఓట్లు వేయని సామాన్య ప్రజలపై ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇది మానవత్వం అనిపించుకుంటుందా?’ అని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘కోపం ఉంటే నాపై చూపండి.. నన్ను చంపాల­నుకుంటే చంపేయండి.. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సాగిస్తున్న నరమేధాన్ని యావత్‌ దేశానికి చాటి చెప్పేలా బుధవారం ఢిల్లీలో వైఎస్‌ జగన్‌ భారీ ఎత్తున ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రతినిధులు వైఎస్‌ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఎన్డీటీవీ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z