Devotional

తిరుమల గదుల్లో శ్రీవారి ప్రసాదాలు తింటున్న మూషికాలు

తిరుమల గదుల్లో శ్రీవారి ప్రసాదాలు తింటున్న మూషికాలు

తిరుమలలోని వసతి గదుల్లో ఎలుకల సంచారం ఎక్కువగా ఉందని, గదిలో ఉంచిన శ్రీవారి ప్రసాదాలను అవి తింటున్నాయని చిలకలూరిపేటకు చెందిన భక్తుడు లక్ష్మణ్‌ తితిదే ఈవో జె.శ్యామలరావుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తుల ఫిర్యాదులకు ఈవో సమాధానాలిచ్చారు. శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకు ఉచిత బస్సు ప్రయాణ సమయాలు, తిరుమలలో ఉచిత బస్సులు ఏయే మార్గాల్లో ప్రయాణిస్తున్నాయనే విషయాన్ని డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కడపకు చెందిన భాస్కర్‌ కోరారు. తిరుత్తణిలో తితిదే స్థలం ఆక్రమణకు గురవుతోందని నగరికి చెందిన నాగరాజన్‌ ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని తెలంగాణకు చెందిన రాజేష్‌ చెప్పారు. తొమ్మిది నెలల క్రితం తితిదేలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారని ఇంతవరకు రాత పరీక్ష నిర్వహించలేదని తిరుపతికి చెందిన దేవానంద్‌ ఫిర్యాదు చేశారు. వీటన్నింటికీ ఈవో స్పందించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z