NRI-NRT

న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారత అంధుల క్రికెట్ జట్టు పరిచయ కార్యక్రమం

న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారత అంధుల క్రికెట్ జట్టు పరిచయ కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అమెరికాలో పర్యటిస్తున్న భార్త అంధ క్రికెటర్లను ప్రోత్సాహించేందుకు బెంగుళూరుకు చెందిన సమర్థనం ట్రస్ట్, క్యాబీ అంధుల క్రికెట్ పై అవగాహన కల్పించడంతో పాటు 2028 పారా ఒలింపిక్స్‌లో భారత అంధుల క్రికెట్ జట్టుకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించేందుకు అమెరికాలో ఫండ్ రైజింగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.

ఈ క్రికెటర్లకు న్యూజెర్సీలో విందు ఏర్పాటు చేసిన నాట్స్ వారిని ప్రోత్సాహించేందుకు ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి భరోసా ఇచ్చారు. మూడు కేటగిరీలుగా ఉన్న అంధుల క్రికెట్ జట్టును మెంటర్ ధీరజ్ నాట్స్‌ సభ్యులకు పరిచయం చేశారు. ఈ మూడు గ్రూపుల వారీగానే క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతాయని వివరించారు. ఈ అంధుల క్రికెటర్లలో ఎక్కువమంది తెలుగు, గుజరాతీ వారు కావడం గమనార్హం. గతంలో అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తెలుగు ఆటగాడు అజయ్ రెడ్డితో పాటు విజయవాడ, వైజాగ్, కర్నాటక, ఒడిస్సా, ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన అనేక మంది ఈ అంధుల క్రికెట్ జట్టులో ఆడుతున్నారు.

అంధుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఈ క్రికెట్ మ్యాచ్‌లు దోహదపడతాయని నాట్స్ పేర్కొంది. అంధ క్రికెటర్లకు తమ వంతు చేయూత అందిస్తామని నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. అమెరికాలో భారత్ అంధ క్రికెటర్ల పర్యటనకు ప్రతి నగరంలో నాట్స్ మద్దతు ఇస్తుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటిలు తెలిపారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, మోహన్ కుమార్ కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z