NRI-NRT

“హర్ ఘర్ తిరంగా” ర్యాలీలో పాల్గొన్న NRIBJP-USA కన్వీనర్ విలాస్‌రెడ్డి

TNILIVE Default Featured Image

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్లో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ యువ మోర్చా అధ్యక్షులు విక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీకి చెందిన ఎన్నారై భాజపా కన్వీనర్ విలాస్‌రెడ్డి జంబుల పాల్గొన్నారు. తిరంగా పండుగా ఉత్సాహంగా ప్రతి పౌరుడు జరుపుకోవాలని, దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని కోరారు. ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జెండా ఎగురవేయాలని కోరారు.

మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి పవన్ రెడ్డి, కార్యక్రమ కోఆర్డినేటర్ ప్రతాప్ వినీత్, మున్సిపల్ అధ్యక్షులు హనుమాన్ తదితరులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ సమైక్యతను కాపాడుకునే ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షులు చిత్రంజన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరేందర్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర, ఉపాధ్యక్షులు అనిల్ గౌడ్, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z