WorldWonders

నెల్లూరులో నిలువు దోపిడీ

నెల్లూరులో నిలువు దోపిడీ

మనీ స్కీమ్‌ తరహాలో నెల్లూరులో భారీ మోసం బయటపడింది. నగరంలోని పొదలకూరురోడ్డు ప్రాంతంలో విశ్వనాథ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఏజెంట్లను నియమించి అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. చెన్నై కేంద్రంగా నిర్వహిస్తోన్న సంస్థ ద్వారా రూ.500 కడితే రూ.7లక్షలు, రూ.6వేలు కడితే రూ.18లక్షలు ఇస్తామని నమ్మబలికి భారీగా నగదు వసూలు చేశారు. జిల్లాలో దాదాపు 10వేల మందికి పైగా ఈ ట్రస్టు ద్వారా రూ.500 నుంచి ఆరువేల వరకు నగదు చెల్లించారు. డబ్బు కట్టిన మహిళలు తమకు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించగా, సమాధానం దాటవేస్తుండటంతో పలువురు ట్రస్టు కార్యాలయానికి చేరుకుని నిర్వాహకులను నిలదీశారు. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z