NRI-NRT

నాట్స్ సహకారంతో చికాగోలో భారత అంధ క్రికెటర్ల పర్యటన

నాట్స్ సహకారంతో చికాగోలో భారత అంధ క్రికెటర్ల పర్యటన

అమెరికాలో పర్యటిస్తున్న భారత అంధ క్రికెటర్ల జట్టు చికాగోలో నాట్స్ సమస్థ సమన్వయంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంది. బెంగళూరుకి చెందిన సమర్ధనం ట్రస్ట్, క్యాబి ఆధ్వర్యంలో వీరంతా అమెరికాలో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్ పై అవగాహన కల్పించటం, 2028 పారా ఒలింపిక్స్ లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిథ్యానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ఈ జట్టు చేస్తున్న పర్యటన ముఖ్యోద్దేశం.

ఈ సందర్భంగా చికాగోలో నాట్స్‌తో పాటు నాట్స్, ప్రవాస భారతీయ సంస్థలు వీరితో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెంటార్ ధీరజ్ అంధుల క్రికెట్‌లో మూడు కేటగిరిలను, వాటి విభజనను నాట్స్ సభ్యులకు వివరించారు. ఈ మూడు గ్రూపుల ఆధారంగానే క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంధుల క్రికెట్ జట్టులో తెలుగు మరియు గుజరాతీ ఆటగాళ్లు ఉన్నారు.

ఈ ఆటగాళ్ళని చూసి అందరం స్ఫూర్తి పొందాలని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. అంధ క్రికెటర్లకు నాట్స్ అండదండలు ఎల్లపుడూ ఉంటాయని, వారు ఆడే మ్యాచ్ లకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్.కె బాలినేని, శ్రీ హరీష్ జమ్ముల, ఇమ్మానుయేల్ నీల, చికాగో చాప్టర్ టీం నుండి వీర తక్కెళ్లపాటి, శ్రీనివాస్ ఎక్కుర్తి, చెన్నయ్య కంబాల, సిరి బచ్చు భారతి పుట్ట, గోపి ఉలవ, కిరణ్, ప్రదీప్, సతీష్ త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z