NRI-NRT

పెమ్మసానికి GWTCS50 ఆహ్వానం

పెమ్మసానికి GWTCS50 ఆహ్వానం

వాషింగ్టన్ డీసీలో GWTCS-50 స్వర్ణోత్సవాలకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం ఆహ్వానించారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పెమ్మసానికు ఆహ్వానపత్రికను అందజేశారు. సెప్టెంబర్ 27,28 తేదీల్లో జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా కోరారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని పెమ్మసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, సామినేని కోటేశ్వరరావు, గోరంట్ల పున్నయ్య చౌదరి, ఘంటా పున్నారావు, వడ్లమూడి నాగేంద్రం, రాయపాటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z