NRI-NRT

భారత అంధుల క్రికెట్ జట్టుకు CAA చేయూత

భారత అంధుల క్రికెట్ జట్టుకు CAA చేయూత

బెంగళూరుకి చెందిన సమర్ధనం ట్రస్ట్, క్యాబి ఆధ్వర్యంలో అమెరికాలో పర్యటిస్తున్న భారత అంధ క్రికెటర్ల జట్టుతో చికాగో ఆంధ్ర సంఘం(CAA) పరిచయ కార్యక్రమాని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంధుల జట్టుకు ఆర్థిక చేయూతనందజేశారు. అంధుల క్రికెట్ పై అవగాహన కల్పించటం, 2028 పారా ఒలింపిక్స్ లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిథ్యానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, బెంగుళూరులో అంధులకు క్రీడా స్టేడియం నిర్మాణానికి ఈ విరాళాలు వినియోగిస్తారు. అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి, సవితా మునగ, అనురాధ గంపాల, సలహాదారులు డా॥ ఉమా కటికి, సంస్థ స్పాన్సరు రమేశ్ తుమ్మ, శైలజ సప్ప, అనూష బెస్త, శ్రీ స్మిత నండూరి, అన్విత పంచాగ్నుల, గిరి రావు కొత్తమాసు, ప్రభాకర్ మల్లంపల్లి, శ్రీనివాస్ పద్యాల, నరసింహారావు వీరపనేని తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z