NRI-NRT

చికాగోలో ఉత్సాహంగా జరిగిన నాట్స్ పికిల్‌బాల్ పోటీలు

చికాగోలో ఉత్సాహంగా జరిగిన నాట్స్ పికిల్‌బాల్ పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో చికాగోలో మొదటిసారి పికిల్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. శనివారం నాడు నేపర్‌విల్‌లో నిర్వహించిన ఈ పోటీలో 150 మంది ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాట్స్ చికాగో విభాగాన్ని అధ్యక్షుడు మదన్ పాములపాటి, ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్‌లు అభినందించారు. తెలుగువారిని కలిపేందుకు ఇలాంటి ఆటల పోటీలు దోహదం చేస్తాయని అన్నారు. నాట్స్ చికాగో చాప్టర్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ ఎక్కుర్తి, స్థానిక ప్రతినిధులు సిరి బచ్చు, భారతి కేసనకుర్తి, ఈశ్వర్ వడ్లమన్నాటి, చెన్నయ్య కంబాల, నవీన్ జరుగుల, నరేంద్ర కడియాల, మహేష్ కిలారు, గోపి ఉలవ, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, నాట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, కార్య నిర్వాహక సభ్యులు ఆర్‌.కె బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ బొప్పన తదితరులు ఈ పోటీల నిర్వహణకు సహకరించారు.

*** విజేతలు:

Kids-
RunnersUp – Bahi & Dhruv
Winners- Sohan & Alok

Intermediate :
Runners – Dinesh & Ankit
Winners – Bala & Sumanth

Advanced :
Runners – Kiran & Mahi
Winners – Elijah & Sanjay

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z