NRI-NRT

MGMNT సందర్శించిన భారత అంధుల క్రికెట్ జట్టు

MGMNT సందర్శించిన భారత అంధుల క్రికెట్ జట్టు

అమెరికా పర్యటనలో ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్టు” మంగళవారం డాలస్ లోని మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించి ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యుడు కమల్ కౌశల్, బాబీ, రవి తదితరులు వీరికి స్వాగతం పలికారు.

ఈ క్రికెట్ జట్టులో సమర్తనం ఇంటర్నేషనల్ ఛైర్మన్ డా. మహన్ టెష్, టీం మేనేజర్ ధీరజ్ సెక్వేరియా ఆటగాళ్ళు – దున్న వెంకటేశ్వర రావు, సునీల్ రమేశ్, షుక్రం మాజిహ్, సంజయ్ కుమార్ షా, రవి అమితి, పంకజ్ భూ, నీలేష్ యాదవ్, నరేష్ తుందా, నకుల బడానాయక్, మహారాజ, లోకేష్, గుడ్డాడప్ప, దుర్గారావు తోమ్పాకి, దినేష్ రాత్వా, దినాగర్, దేబరాజ్ బెహరా, అజయ్ కుమార్ రెడ్డి(అర్జున అవార్డు గ్రహీత – విజయవాడ)లు ఉన్నారు.

వీరు ఆడె క్రికెట్ బంతి సాధారణ బంతిలా కాకుండా దానిలో శబ్దంచేసే కొన్ని మువ్వలు లాంటివి ఉంటాయి. బౌలర్ బంతి విసిరినప్పుడు, ఆ బంతి చేసే శబ్దం ఆధారంగా బ్యాట్స్‌మెన్ ఆడతారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ఈ జట్టు పలు ట్రోఫీలను కైవసం చేసుకుంది. ఈ క్రికెట్ టీం విదేశీ పర్యటనకు “సుబ్బు కోట ఫౌండేషన్” సహకారం అందిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z