NRI-NRT

నాట్స్ చికాగో క్రికెట్ టొర్నీ విజేతగా SRK జట్టు

నాట్స్ చికాగో క్రికెట్ టొర్నీ విజేతగా SRK జట్టు

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) చికాగోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌లో దాదాపు 150 మందికి పైగా క్రికెటర్లు తమ క్రీడా ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు. ఎస్.ఆర్.కె టీం ఈ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. రన్నరప్‌గా లయన్స్ టీం నిలిచింది. క్రీడాకారులను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అభినందించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, టోర్నమెంట్ నిర్వహణలో భాగస్వాములైన వారికి ధన్యవాదాలు తెలిపారు.

నాట్స్ కార్యవర్గ సభ్యుడు శ్రీహరీష్ జమ్ముల, చికాగో చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్లపాటి, నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, చెన్నయ్య కంబాల, నవీన్ జరుగుల, సింధు కంఠంనేని, గ్రహిత బొమ్మిరెడ్డి, ప్రియాంక పొన్నూరు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ కార్యవర్గ సభ్యులు ఆర్కే బాలినేని, ఇమ్మాన్యుయేల్ నీల, నాట్స్ మాజీ కార్యవర్గ సభ్యుడు కృష్ణ నిమ్మగడ్డ, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన, సతీష్ త్రిపురనేని, పాండు చెంగలశెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండి, సునీల్ ఆకులూరి, సునీల్ ఆరుమిల్లి, అరుల్ బాబు, వినోద్ బాలగురు, గోపి ఉలవ, శ్రీనివాస్ పిల్ల, సుమంత్ పోపూరి, సాయి, హరి, నాగ తదితరులు పోటీల నిర్వహణకు సహకరించారు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z