Sports

ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కేశినేని ఏకగ్రీవం

ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కేశినేని ఏకగ్రీవం

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభపరిణామం అన్నారు. ఏసీఏ తొలి నిర్ణయంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్‌కు వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికగా ఉందని తెలిపారు. మంగళగిరి, కడపలోనూ ఇంటర్నేషనల్‌ మ్యచ్‌లు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్‌ ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. ఏసీఏ ఇతర పదవులకూ కేశినేని శివనాథ్‌ ప్యానల్‌ ఎన్నికైంది. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్‌, కార్యదర్శిగా సానా సతీశ్‌, జాయింట్‌ సెక్రటరీగా విష్ణుకుమార్‌ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా విష్ణుతేజ్‌ ఎన్నికయ్యారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z