NRI-NRT

NRI: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వైభవంగా చవితి వేడుకలు

NRI: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వైభవంగా చవితి వేడుకలు

సింగపూర్ తెలుగు సమాజం (STS) ఆధ్వర్యంలో శనివారం నాడు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో వినాయక షోడషోపచార, ఏకవింశతి, దూర్వాయుగ్మ, అష్టోత్తర శతనామావళి, వినాయకోత్పత్తి, శమంతకమణోపాఖ్యానం ఏర్పాటు చేశారు. పూజ అనంతరం ప్రసాద వితరణ చేశారు. లడ్డూ వేలంలో లక్ష్మి-కరణ్ దంపతులు లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమం చివరగా నిమజ్జనంతో ముగిసింది.

తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రకృతి విపత్తుల నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు సుప్రియ, సుస్మిత కొల్లి, కిండల్ కిడ్స్ పాఠశాల, విగ్రహ దాతలు పుట్టి ప్రసాద్, ముద్దం విజ్జేందర్, తాటిపల్లి విజయబాబు, కొత్తమాసు రాజశేఖర్, శ్రవణ్ బల్కి తదితరులు సహకరించారు. కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z