NRI-NRT

ఇబ్రహీంపట్నం వరద బాధితులకు తానా ఫౌండేషన్‌ సహాయం

ఇబ్రహీంపట్నం వరద బాధితులకు తానా ఫౌండేషన్‌ సహాయం

ఏపీలో ఇటీవలి వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సహాయక చర్యలు చేపట్టారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి ఆధ్వర్యంలో ఎలప్రోలు గ్రామంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 1645 నిత్యావసర బాక్స్‌లను బాధితులకు అందజేశారు. చీరలు, టవళ్ళను కూడా అందజేస్తామని శశికాంత్ వెల్లడించారు. తెలంగాణలోని వరద బాధితులకు కూడా సహాయాన్ని అందిస్తున్నట్లు శశికాంత్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z