NRI-NRT

₹30లక్షల విరాళం అందజేసిన నార్త్ అమెరికా కమ్మ సంఘం

₹30లక్షల విరాళం అందజేసిన నార్త్ అమెరికా కమ్మ సంఘం

ఏపీలో వరద బాధితులకు అండగా, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తుండగా, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు సహాయక చర్యలకు తమవంతుగా విరాళాలు అందజేస్తున్నారు.

ఈ క్రమంలో భాగంగా అమెరికాలోని NAKS( నాక్స్ – నార్త్ అమెరికా కమ్మ సంఘం) సంస్థ ₹30లక్షల రూపాయలను విరాళంగా సేకరించారు. సంస్థ ప్రతినిధులు వుయ్యూరు శ్రీనివాస్, కొల్లా అశోక్‌బాబులు బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ చెక్కును అందజేశారు. సీఎం వరద సహాయ నిధికి ఈ మొత్తాన్ని జమచేశారు. విరాళాల సేకరణకు శ్రీనివాస్ ఉయ్యురు, సురేష్ చన్నమల్లు, అశోక్ కొల్లా, అనిల్ చిమ్మిలి, ప్రుదేశ్ మక్కపాటి, శివ మొవ్వ, భానుప్రకాష్ గుళ్లపల్లి, భూషణ్ పాలడుగు, సురేంద్ర పాలడుగు, కృష్ణ నాయుడు, కోటేశ్వరరావు కందిమళ్ల, స్వాతి పోలవరపు, నర్రా వెంకట్, ఉన్నం లక్ష్మీనారాయణ, నరేష్ గొల్ల, లక్ష్మణ్ పర్వతనేని, అక్షర చేబ్రోలు, కిషోర్ తమ్మినేని, రంజిత్ కోమటి, వెంకట్ ప్రేమ్‌చంద్ తానికొండ తదితరులు సహకరించారు. వీరికి NAKS ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z