NRI-NRT

పద్మ పురస్కారం అందుకున్నట్టు ఉంది: GWTCS వేడుకలో గుమ్మడి

పద్మ పురస్కారం అందుకున్నట్టు ఉంది: GWTCS వేడుకలో గుమ్మడి

ప్రముఖ రంగస్థల నటుడు, ఏపీ నాటక అకాడమీ మాజీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ రంగస్థల, నాటక రంగాలకు చేసిన విశేష సేవలను గుర్తిస్తూ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) శుక్రవారం నాడు నిర్వహించిన తమ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయనను GWTCS Presidential Awardతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేతుల మీదుగా ఆయనకు అందజేశారు. గుమ్మడి మాట్లాడుతూ GWTCS పురస్కారం అందుకోవడం పద్మ పురస్కారం అందుకున్నంత ఆనందంగా ఉందన్నారు. అమెరికాలో 50ఏళ్లుగా తెలుగువారికి సేవ చేస్తున్న సంస్థ నుండి పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని, ఈ సంస్థ మరిన్ని సంవత్సరాలు తెలుగువారికి హితమైన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z