NRI-NRT

చికాగోలో CAA పికిల్‌బాల్ టోర్నీ

చికాగోలో CAA పికిల్‌బాల్ టోర్నీ

చికాగో ఆంధ్ర సంఘం (CAA) ఆధ్వర్యంలో సెప్టెంబరు 22న పికిల్ బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. బిగినర్స్, ఎడ్వాన్స్డ్ విభాగాలలో ఈ పోటీలను నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లుల ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి సహకారంతో నరసింహరావు వీరపనేని నేతృత్వంలో జరిగిన ఈ పోటీలలో 50 మందికి పైగా చికాగో వాసులు క్రీడాస్ఫూర్తితో పాల్గొన్నారు.

ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల నిర్వహణకు బోస్ కొత్తపల్లి, ఆర్తీ శ్రీనాధ్, నందన్ నండూరి, శ్రియా కొంచాడ, ధీరజ్ ఐనపూడి, సురేశ్ కుమార్ ఐనపూడి, ఆశ్రిత్ కొత్తపల్లిలు కృషి చేశారు. సంఘ బోర్డు సభ్యులు శ్రీనివాస్ పద్యాల, మురళీ రెడ్డివారి, హేమంత్ తలపనేని, శైలజ సప్ప, శ్రీస్మిత నండూరి, తమిశ్ర కొంచాడ, పద్మారావు అప్పలనేని, నరేశ్ కుమార్ చింతమాని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరి రావు కొత్తమాసు, సవిత మునగ తదితరులు పాల్గొన్నారు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z