NRI-NRT

తిరుమల ఎన్ఆర్ఐ కోటా దర్శనాల్లో మార్పులు చేయండి. స్పీకర్‌కు వినతిపత్రం

తిరుమల ఎన్ఆర్ఐ కోటా దర్శనాల్లో మార్పులు చేయండి. స్పీకర్‌కు వినతిపత్రం

తిరుమల శ్రీవారి దర్శనంలో ఎన్ఆర్ఐలకు ప్రస్తుతం అందిస్తున్న తాత్కాలిక పరిమితులను సడలించి, భారత పర్యటనకు వచ్చే ప్రవాసులతో పాటు వారి కుటుంబ సభ్యులు నలుగురికి స్వామివారి దర్శనానికి వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తానా సభ్యత్వ ప్రయోజనాల కమిటీ సమన్వయకర్త సాయి బొల్లినేని అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఏపీ ఎన్నారై వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లకు వినతిపత్రాన్ని సమర్పించారు. తిరుమలలో ఎన్ఆర్ఐ కోటా దర్శనం విధానంలో సవరణ చేయాలని కోరారు. ఈ సవరణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి తానా సిద్ధంగా ఉందని సాయి తెలిపారు. దీనికి స్పీకర్, మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z