NRI-NRT

50మంది విద్యార్థులకు ₹5లక్షల ఉపకారవేతనలు అందజేసిన వెంకట్ జిల్లెళ్లమూడి

50మంది విద్యార్థులకు ₹5లక్షల ఉపకారవేతనలు అందజేసిన వెంకట్ జిల్లెళ్లమూడి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో మంగళవారం నాడు 50 మంది విద్యార్థినీ విద్యార్థులకు ₹5లక్షల విలువైన ఉపకారవేతనలను అందజేశారు. ఈ మొత్తాన్ని డల్లాస్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు జిల్లెళ్లమూడి వెంకట్ విరాళంగా అందజేశారు. పేద విద్యార్థులకు సాయం చేసే అవకాశం కల్పించిన తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ పోలవరపులకు వెంకట్ ధన్యవాదాలు తెలిపారు. ఉప్పుటూరి చినరాములు, బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తనాకు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z