NRI-NRT

మలేషియాలో “మైతా” బతుకమ్మ సంబురం

మలేషియాలో “మైతా” బతుకమ్మ సంబురం

మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో మలేషియా తెలంగాణ సంఘం (మైతా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుక ఘనంగా నిర్వహించారు. ఉత్తమ బతుకమ్మలకు బంగారు బహుమతులు అందించారు. ముఖ్య అతిథిగా భారత హైకమీషన్ ప్రథమ కార్యదర్శి రాజేష్ హెచ్ మణియాల్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. “మైతా”కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు, మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రేజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రేజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్, శ్రీహరి, జీవం రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z