Movies

150 ఎకరాల స్థలం అమ్మకంలో మోసం

150 ఎకరాల స్థలం అమ్మకంలో మోసం

తనకు న్యాయం దొరికే వరకు పోరాడుతానని సినీనటి గౌతమి తెలిపారు. రామనాథపురం జిల్లా ముతుకులత్తూర్‌ సమీపంలో నటి గౌతమికి చెందిన 150 ఎకరాల స్థలం అమ్మిపెడతానని కారైక్కుడికి చెందిన సినీ ఫైనాన్సియర్‌ అళగప్పన్‌ రూ.3.1 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది. అతని నుంచి తన డబ్బు ఇప్పించాలని కోరుతూ గౌతమి రామనాథపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ రామనాథపురం జిల్లా కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో గురువారం గౌతమి కోర్టు విచారణకు హాజరై న్యాయమూర్తి ఎదుట వివరణ ఇచ్చారు. అళగప్పన్‌కు బెయిల్‌ ఇవ్వకూడదని ఆమె న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z