ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలకు పలువురు ప్రముఖులను ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఈ బృందం పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసింది.
ఆహ్వానాలు అందుకున్న వారిలో “పద్మభూషణ్” గ్రహీత, గ్యాస్ట్రో ఎంట్రాలిజిస్ట్ డి.నాగేశ్వరరెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, మహా న్యూస్ వంశీ, కీళ్ల వైద్య నిపుణులు గురవారెడ్డి, కంటి వైద్య నిపుణులు కాసు ప్రసాద్ రెడ్డి, వ్యాపారవేత్తలు స్వప్నకుమార్, ప్రసాద రావు, గ్లో సంస్థ ప్రతినిధి వెంకన్న చౌదరి తదితరులను ఆహ్వానించింది.
బృందంలో సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, ఇండియా సమన్వయకర్త మనోహర్ కిలారు తదితరులు ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z