జులై 3 నుండి 5 వరకు డెట్రాయిట్లో జరగనున్న తానా 24వ మహాసభలకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ లో ఆయన్ను కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ళ. తదితరులు స్పీకర్ ని కలిసిన వారిలో ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z