రాయసీమలో లంకె బిందెలు బయటపడిన ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉంటాయి. పురాతన కాలంనాటి ఇళ్లను కూల్చివేసేటప్పుడు, కొత్త నిర్మాణాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇలా వెండి, బంగారు, రాగి నాణేలు.. ఆభరణాలు బయటపడుతూ ఉంటాయి.
కూలీలకు ఈ నిధి కనిపిస్తే విషయం పక్కాగా పోలీసుల వద్దకు వెళ్తుంది. ఎందుకంటే పంపాకాల్లో తేడాలు వస్తాయి కాబట్టి. ఇంటి యజమానులకే పురాతన ఆభరణాలు లేదా నాణేలు దొరికాయి అనుకోండి.. వాటిని సైలెంట్గా దాచేస్తారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ పురాతన నిధి దొరికిన ఘటన చర్చనీయాంశమైంది. శరణ బసప్ప అనే వ్యక్తి.. హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామంలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.
కొంతమంది కూలీలను పెట్టి పాత ఇంటిని కూల్చేశాడు. కొత్త ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా.. ఓ లంకె బిందె బయటపడింది. విషయం వెంటనే అధికారులు వద్దకు చేరింది. పోలీసులతో పాటు రెవిన్యూ అధికారులు అతడి ఇంటి ముందు వాలిపోయారు. ఆ బిందెను స్వాధీనం చేసుకుని.. ఓపెన్ చేయగా.. లోపల 1900 సంవత్సరంలో బ్రిటిష్ సర్కార్ ముద్రించిన సిల్వర్ కాయిన్స్, 1897 సంవత్సరానికి చెందిన రాగి నాణేలు ఉన్నట్లు గుర్తించారు.