NRI-NRT

అమెరికాలో మోడీకి ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులు

అమెరికాలో మోడీకి ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులు

అమెరికా పర్యటనకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్రమోడీని స్వాగతిస్తూ ప్రవాస భారతీయులు వెల్‌కం మోడీ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. GM Renaissance సెంటర్, డౌన్‌టౌన్ డెట్రాయిట్ లో భారతీయ జెండాలు పట్టుకుని మోడీకి ఇదే మా స్వాగతం అంటూ నినదించారు. ఈ వెల్ కం మోడీ కార్యక్రమానికి 150 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. శ్యామ్ ఇనగంటి, రాజేందర్ సందడి, చంద్రు ఆచార్య, హేమ రాచమలే, హరి దేవబత్తిని, వేణు శ్రీదాస్యం, అశోక్ బడ్డి నాయకత్వం వహించారు. భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపచేస్తున్న మోడీకి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహం చూపించారు. మోడీ మోడీ అంటూ నినదించారు.