Devotional

జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

టీటీడీ ఆధ్వర్యంలో జూలై 10నుండి 12వ తేదీ వరకు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల గోవిందరాజస్వామి సత్రాల్లో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. ఈ మూడురోజుల పాటు ఉదయం భజన మండళ్లతో సుప్రభాతం, సామూహిక భజన కార్యక్రమాలు చేప‌డ‌తారు. సాయంత్రం సంగీత విభావరి, ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. జూలై 10న సాయంత్రం 4 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం అధికార ప్రముఖులు సందేశం ఉంటుంది. జూలై 12వ తేదీ ఉదయం 4 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్ల పూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు. గ‌తంలో ఎందరో. మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని కాలిన‌డ‌క అధిరోహించి స్వామివారి అనుగ్రహం పొందారు. అలాంటివారి అడుగు జాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో దాస సాహిత్య ప్రాజెక్టు మెట్లోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది.