ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది డిసెంబరు లోగా 100 పాఠశాలల్లో CPR-AED శిక్షణా తరగతులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్, అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్లు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా గుండెపోటుకు గురైనప్పుడు, అత్యవస సమయాల్లో చేయాల్సిన చికిత్సపై అవగాహనను కల్పిస్తామని వీరు తెలిపారు.
ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భాగంగా శనివారం నుండి బుధవారం వరకు గుంటూరులోని 7 పాఠశాలల్లో ఈ CPR-AED కార్యక్రమాన్ని ఫౌండేషన్ ట్రస్టీ ఎండూరి శ్రీనివాస్ సమన్వయంలో ఏర్పాటు చేశాఅమని వారు తెలిపారు. తానా న్యూఇంగ్లాండ్ ఆర్ఆర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి, డాక్టర్ ఓ.కె. మూర్తి ఈ శిక్షణా కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్నారు. భాష్యం, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో ఎన్నారైలు సూర్య తెలాప్రోలు, దగ్గుబాటి సురేష్, కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్థన్, ప్రిన్సిపాల్ షఫీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.