Politics

బీజేపీపై విజయసాయిరెడ్డి ఫైర్

బీజేపీపై విజయసాయిరెడ్డి ఫైర్

దొంగ చేతికే తాళం ఇచ్చిందని..బీజేపీపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. పురంధేశ్వరికి బీజేపీ చీఫ్‌ పదవి ఇవ్వడంపై మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురంధేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం.బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటే అని. అందుకేకదా దొంగ చేతికే తాళం ఇచ్చింది! అంటూ చంద్రబాబు , పురంధేశ్వరి ఉన్న ఫోటోలను షేర్‌ చేశారు విజయసాయిరెడ్డి.ఢిల్లీ సాక్షిగా కుట్రల చేయడం మీ మరిది గారికి అలవాటే. కానీ ఈసారి మిమ్మల్నీ తీసుకెళ్లి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి…అదీ హైలైట్. చంద్రబాబు జీవితంలో ఎవ్వరికీ విశ్వసనీయమైన స్నేహితుడు కాలేడన్న కమ్మటి వాస్తవం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలుసు అంటూ విమర్శలు చేశారు.