Devotional

శంకారాచార్యుల విగ్రహావిష్కరణ వాయిదా

శంకారాచార్యుల విగ్రహావిష్కరణ వాయిదా

పరమేశ్వరుడి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహా విగ్కహావిష్కరణ వాయిదా పడింది.శంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 5వేల మందికి పైగా సాధువులు పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 18న ఐక్యతా విగ్రహంగా ఆవిష్కరించాల్సి ఉండగా ఆ కార్యక్రమం సెప్టెంబర్ 21న నిర్వహిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ మేరకు పౌరసంబంధాల శాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కేరళ సంప్రదాయాల ప్రకారం సాధువులకు స్వాగతం పలకనున్నారు. అనంతం సాధువులతో కలిసి యజ్ఞం చేయనున్నారు.