Politics

60-70 సీట్లు నేడే ఫైనల్: ఎంపీ కోమటిరెడ్డి

60-70 సీట్లు నేడే ఫైనల్: ఎంపీ కోమటిరెడ్డి

తెలంగాణలోని 60-70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం జరిగే కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం రాత్రి కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌తో భేటీ అయిన తర్వాత విలేకర్లకు ఈ విషయం చెప్పారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని, అభ్యర్థులను ఖరారు చేస్తే వారంతా ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని తాను మురళీధరన్‌కు చెప్పినట్లు వెల్లడించారు. భారాస మాదిరి ముందస్తుగా టికెట్లు ఖరారు చేయడం కాంగ్రెస్‌ లాంటి జాతీయపార్టీలో సాధ్యం కాదన్నారు. భారాస ప్రాంతీయ, కుటుంబ పార్టీ అయినందున ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందన్నారు.