DailyDose

ఏపీలో ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త

ఏపీలో ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త అందింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఇకపై ఎప్పుడైనా, ఎక్కడైనా సర్టిఫికెట్లు సులభంగా పొందేలా ఇంటర్ బోర్డు వెసులుబాటు కల్పించింది. పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వలెన్సి, జెన్యూన్ నెస్ సర్టిఫికెట్లను డిజిలాకర్ లో పొందుపరిచింది.2014 నుంచి 2023 వరకు ఇంటర్ పూర్తి చేసిన 45.53 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచింది. దీంతో ధృవపత్రాలు పోగొట్టుకున్న ఈ డిజిలాకర్ ద్వారా తిరిగి పొందవచ్చు. ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షలు అయిపోయినప్పటికీ.. సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.