Politics

ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు

ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు

సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీకి రెండు సీట్లు ఇస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది. చెన్నూరు, కొత్తగూడెం టికెట్ల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీపీఎం నేతలతోనూ పొత్తు గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. సఫలం అయితే ఆ పార్టీకి కూడా రెండు సీట్లు కేటాయించి అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 58 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును నేడు రిలీజ్ చేయనున్నది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ లిస్టును ప్రకటిస్తున్నారు. ఢిల్లీ వేదికగా కేసీ వేణుగోపాల్ సమక్షంలో కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకులతో ఇప్పటికే భేటీ జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z