ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ మంచి స్కోరు సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తాంజిద్ హసన్ (51; 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు), లిట్టన్ దాస్ (66; 82 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. తర్వాత వచ్చిన నజ్ముల్ శాంటో (8), మెహదీ హసన్ మిరాజ్ (3) సింగిల్ డిజిట్కే పరిమితం కాగా.. తౌహిద్ హృదోయ్ (16), నసుమ్ అహ్మద్ (14) పరుగులు చేశారు. ముష్ఫీకర్ రహీమ్ (38; 46 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. చివర్లో మహ్మదుల్లా (46; 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, మహ్మద్ సిరాజ్ 2, జస్ప్రీత్ బుమ్రా 2, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
👉 – Please join our whatsapp channel here –