NRI-NRT

దుబాయి తెలుగు సంఘం నూతన కార్యవర్గం

దుబాయి తెలుగు సంఘం నూతన కార్యవర్గం

అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన దుబాయి తెలుగు అసోసియేషన్ ఎన్నికలలో మార్పుకు నాందిగా దాదాపు నూతన కార్యవర్గం ఎన్నికయింది. ఆదివారం ఉదయం జరిగిన పోలింగ్ లో ఓటర్లు మార్పును కోరుకొన్నారు. హోరహోరిగా జరిగిన పోరులో అధ్యక్షునిగా హైదరాబాద్ నగరానికి చెందిన బాలుస వివేకానంద ఎన్నికయ్యారు.

అధ్యక్షునితో పాటుగా కోశాధికారి మరియు ఆంధ్రప్రదేశ్ కోటా బోర్డ్ డైరెక్టర్ పదవికి కూడా ఎన్నికలు జరిగాయి. కోశాధికారిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోటా నుండి డైరెక్టర్లుగా శేఖ్ ఫహీం (అనంతపురం), లతా నగేశ్ (విశాఖపట్టణం) ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షునిగా తెలుగు ప్రముఖుడు కటారు సుదర్శన్ (తిరుపతి) ప్రధాన కార్యదర్శిగా కలకోట విజయభాస్కర్ రెడ్డి (గుంటూరు) తెలంగాణ బోర్డు డైరెక్టర్లుగా బంగారి భీంశంకర్ (నిజామాబాద్) చకినాల చైతన్య (రాజన్న సిరిసిల్లా)లు అంతకు ముందు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నలుగురికి అదనంగా మరో నలుగురు ప్రత్యక్షంగా బ్యాలెట్ విధానంతో సంబంధం లేకుండా మరో నలుగురు వ్యవస్థాపక డైరెక్టర్ల కోటా నుండి పరస్పర ఆంగీకారంతో నేరుగా కార్యవర్గంలో నామినేట్ అయ్యే వెలుసుబాటు ఉంది. ఈ రకంగా మహమ్మద్ మసీయోద్దీన్ (హైద్రాబాద్), సురేంద్ర ధనేకుల (విజయవాడ), శ్రీధర్ దామర్ల (గుంటూరు), శ్రీనివాస రావు యండూరి (ప్రకాశం)లు ఎంపికయ్యారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z