Politics

హైదరాబాద్ అభివృద్ధిపై ఆసక్తికర విషయాలు చెప్పిన కేటీఆర్

హైదరాబాద్ అభివృద్ధిపై ఆసక్తికర విషయాలు చెప్పిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీ సమీపిస్తోంది. దీంతో పాటు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ ప్రచారంలోకి దూసుకుపోతుంది. నియోజకవర్గంలో అభ్యర్థుల తరపున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్, ఎమ్మెల్సీ కవిత ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరంతా బహిరంగ సభలు, వీధి సభలు, రోడ్ షోల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు చెప్పి ఆశీర్వదించాలన్నారు.

ఇక మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. సమయాన్ని వృథా చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ బీఆర్‌ఎస్‌ అభివృద్ధి పనుల గురించి నెటిజన్లకు తెలియజేస్తున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ ఆసక్తికర విషయాలు చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఈ పదేళ్లలో హైదరాబాద్‌కు చేయని మొదటి మూడు పనులు ఏమిటి? అని ఓ నెటిజన్ మంత్రిని ప్రశ్నించారు. కేటీఆర్ స్పందిస్తూ…1) మూసీ సుందరీకరణ, 2) అర్బన్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ అండ్ డ్రైనేజీ సిస్టమ్ మెరుగుదల, 3) రాబోయే 10 సంవత్సరాలలో 415 కి.మీ వరకు మెట్రో కనెక్టివిటీ (రాబోయే 5 సంవత్సరాలలో కనీసం 250 కి.మీ)గా చెప్పారు. తొలి ప్రాధాన్యతతో ఈ పనులను పూర్తి చేస్తానని కేటీఆర్ వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వస్తే ఏ శాఖను చేపడతానన్న అంశంపై ఇటీవల మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే టూరిజం శాఖ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరతానని కేటీఆర్ వెల్లడించారు. గత ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ సాధించలేని అభివృద్ధిని బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో సాధించిందన్నారు. తెలంగాణకు అపారమైన పర్యాటక అవకాశాలు ఉన్నాయని, భారీ రిజర్వాయర్ల నిర్మాణం తర్వాత తెలంగాణ మరింత మెరుగుపడిందని కేటీఆర్ అన్నారు. , తెలంగాణలో వైద్య, ఆధ్యాత్మిక, క్రీడలు, అటవీ పర్యాటక రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పర్యాటక శాఖను అడుగుతామన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z