ఫ్యాన్ క్లబ్స్, ఫ్యాన్ పేజీల తీరుపై బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి పలువురు తన పేరును ఉపయోగించుకుంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
‘‘నా పేరుని ఉపయోగించి కొన్ని ఫ్యాన్ పేజీలు తమ అభిమాన నటీనటులకు ఫేవర్గా పోస్టులు క్రియేట్ చేస్తున్నాయి. అవి నా దృష్టికి వచ్చాయి. ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఏ ఒక్కరినీ ప్రశంసించడానికి లేదా అభినందించడానికి నేను ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వలేదు. ఇలాంటివి రిపీటైతే.. రిపోర్ట్ చేస్తా. మీరు ఏదైనా పోస్టు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోండి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు’’ అని ఆమె తెలిపారు. అయితే, ఆమె ఉన్నట్టుండి ఇలా రియాక్ట్ కావడానికి కారణం ఏమిటి? అనేది మాత్రం పూర్తిగా చెప్పలేదు.
2011లో బాలీవుడ్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చారు పరిణీతి చోప్రా. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘కిల్ దిల్’, ‘డిష్యూం’, ‘కేసరి’, ‘సైనా’, ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ చిత్రాల్లో ఆమె నటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఎంపీ రాఘవ్ చద్దాను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –