Food

ఈ చేప ఖరీదు మూడు లక్షలకు పైగా!

ఈ చేప ఖరీదు మూడు మూడు లక్షలకు పైగా!

గోల్డెన్‌ ఫిష్‌గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. పూడిమడకకు చెందిన వ్యాపారి మేరుగు కొండయ్య దీన్ని రూ.3.90 లక్షలకు దక్కించుకున్నారు. ఈ మీనం 27 కేజీల బరువు ఉందని మత్స్యకారుడు మేరుగు నూకయ్య తెలిపారు. కచిడి చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు తెలిపారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్‌ బ్లాడర్‌తో తయారు చేస్తారని, మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z