Politics

ప్రజా రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుంది!

ప్రజా రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుంది!

మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan) నాశనం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) మండిపడ్డారు. రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

‘‘జగన్‌ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. రూ.వేల కోట్ల విలువైన భవనాలను శిథిలం చేశారు. భూములు ఇచ్చిన రైతులను హింసించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారు. జగన్‌ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది. ప్రజా రాజధాని అమరావతి (Amaravati) అజరామరమై నిలుస్తుంది’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z