Politics

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరిలో నమోదైన నకిలీ ఓట్లు తొలగించాలని తిరుపతి గ్రామీణం ఆర్డీవో కార్యాలయం వద్ద తెదేపా నేతలు సోమవారం ధర్నాకు దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పార్టీ నేత పులివర్తి నాని నిరాహార దీక్ష చేపట్టారు. వారికి పోటీగా అధికార వైకాపా నేతలు దళితులతో కలిసి అక్కడే నిరసనకు దిగారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z