ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్లోని బేగంబజార్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు చేశారు. అవాస్తవాలు మాట్లాడిన నారాయణస్వామిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ఆర్కు సోనియా గాంధీ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక విమానాలు పంపించి జాడ కోసం వెతికించారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్లే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. ఈ విషయాన్ని నారాయణ స్వామి గ్రహించాలి. ఇప్పటికైనా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మల్లు రవి హెచ్చరించారు.
👉 – Please join our whatsapp channel here –