నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు తెలంగాణ రాష్ట్ర అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. వాణిజ్యపన్నుల శాఖ అధికారులు కె.సీతాలక్ష్మి, జి.ఫణీందర్ రెడ్డిని ఐఏఎస్ అధికారులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ రెవెన్యూ కోటా నుంచి ఐఏఎస్గా ఉన్న ఒమర్ జలీల్, అర్విందర్ సింగ్ పదవీవిరమణతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక్కో పోస్టుకు ఐదుగురు చొప్పున పది మంది అధికారులు గత నెల 20న ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. సీతాలక్ష్మి, ఫణీందర్ రెడ్డితో పాటు వి.శ్రీనివాసులు, యాదగిరిరావు, చంద్రశేఖర్ రెడ్డి, సైదా, మహేందర్, మధుకర్ బాబు, పద్మజ రాణి, పంకజ ఇంటర్వ్యూలకు వెళ్లిన వారిలో ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –