NRI-NRT

ఖతార్‌లో ఉత్కంఠభరితంగా క్రికెట్ పోటీ

ఖతార్‌లో ఉత్కంఠభరితంగా క్రికెట్ పోటీ

దోహాలోని క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ CRIC QATAR మినీ మెగా లీగ్‌ను నిర్వహించింది. భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుండి ప్రవాస జట్లు పాల్గొన్నాయి. ఐకాన్ క్రికెట్ క్లబ్, నో ఫియర్ టీమ్ మధ్య తుదిపోరు జరిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఐకాన్ జట్టు 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నో ఫియర్ జట్టు 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసింది. క్రిక్ ఖతార్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ రఫీ, సెంట్రల్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు జై ప్రకాశ్ సింగ్, తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగోని, ఐసీసీ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు విమల్ కుమార్ మణి, ఆంధ్రకళా వేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల, ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ దీపక్ చుక్కాల, ప్రముఖ పంజాబీ గాయకుడు మోహిందర్ జలంధరి, అమెరికాకు చెందిన అద్నాన్ సయ్యద్, కొరియోగ్రాఫర్ రేణి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z